న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ పథకానికి మూడేండ్లు నిండిన నేపథ్యంలో స్వచ్ఛతే సేవ ప్రచారానికి మద్దతు తెలుపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ రంగాల్లోని ప్రముఖులకు లేఖలు రాశారు. ఇందులో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి కోటి మొక్కల రామయ్యకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆయనకు ప్రధాని పిలుపునిచ్చారు. కోటి మొక్కల రామయ్య చేసిన సేవలను మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి అండగా నిలువడం అంటే దేశానికి గొప్పసేవ చేయడంతో సమానమని ప్రధాని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm