విజయవాడ: విజయవాడ పటమటలోని ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఇంటర్ విద్యార్థినిని అపహరించేందుకు దుండగులు యత్నించారు. కళాశాలకు వెళుతున్న యువతిని రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఐదుగురు యువకులు అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనం ఎక్కాలని లేదంటే బ్లేడ్లతో దాడి చేస్తామని హెచ్చరించారు. స్థానికంగా ఉన్న ఓ మహిళ విద్యార్థినిపై దాడిని అడ్డుకోవడంతో యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల నుంచి తప్పించుకున్న విద్యార్థిని వన్టౌన్లోని తన ఇంటికి చేరుకుంది. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పటమట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm