న్యూఢిల్లీ: దసరా, దీపావళి, ఛాత్ పండుగల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 4వేల ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. గతేడాది 3,800 రైళ్లను ఏర్పాటు చేశామని..ఈ సారి ప్రయాణికుల రద్దీ పెరుగనుండటంతో రైళ్లను సంఖ్యను పెంచినట్లు ఆయన తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులు సంఖ్య పెరిగితే ఫ్లాట్ఫాం టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేయడంతోపాటు ఫుట్ఓవర్ బ్రిడ్జిల వాడకాన్ని కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని మనోజ్ సిన్హా పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm