అమరావతి : టెలీ మెడిసిన్ టెండర్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. జిల్లా ఆస్పత్రిల్లో సిటీ ఎంఆర్ ఐ స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులపై కేంద్రం నివేదిక ఇచ్చిందని, ఏపీలో జనవరి నుంచి ఇప్పటి వరకు 12,298 మలేరియా, 1,454 డెంగ్యూ కేసులు నమోదైతే ఒక్క మరణం కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూతో 13 మంది మృతి చెందారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm