ముంబై: ఆగస్టు 29 న ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన ఘటనను మరవకముందే మళ్లీ ముంబైని భారీ వర్షాలు వణికించాయి. మంగళవారం సాయంత్రం ముంబై నగరంలో భారీ వర్షం కురవడంతో ఇవాళ స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మూతపడ్డాయి. ఇక.. గేట్ ఆఫ్ ఇండియా వద్ద సముద్రం ఉప్పొంగుతున్నది. భారీ అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం ఆటుపోట్లు ఇవాళ గేట్ ఆఫ ఇండియా దగ్గర ఎక్కువగా ఉండనున్నాయి. గేట్ ఆఫ్ ఇండియాను భారీ అలలు తాకనున్నాయి. దీంతో గేట్ ఆఫ్ ఇండియా ప్రాంతంలో పర్యటించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm