అమరావతి : ప్రముఖ దర్శకుడు రాజమౌళి అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఆయన వెంట సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు ఉన్నారు. ఈ ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో రాజమౌళి సమావేశమయ్యారు. రాజధానిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో రాజమౌళి సహకారాన్ని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆకృతులపై చర్చించేందుకు రాజమౌళి అమరావతి వచ్చారు. ముఖ్యమంత్రితో దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన అమరావతిలో పర్యటించారు. ఈ పర్యటన అనంతరం మరోసారి సీఎంతో భేటీ కానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm