న్యూఢిల్లీ: దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్కు మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ పేరు ప్రతిపాదించింది బీసీసీఐ. పద్మ అవార్డుల కోసం కేవలం ధోనీ పేరునే ప్రతిపాదించామని, ఇది బోర్డు ఏకగ్రీవ నిర్ణయమని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ధోనీ పేరును పద్మభూషణ్కు నామినేట్ చేశాం. ధోనీ సాధించిన ఘనతలు సాధారణమైనవి కావు. రెండు వరల్డ్కప్లు, పది వేల వరకు పరుగులు, 90 టెస్ట్ మ్యాచ్ల రికార్డు అతని సొంతం. ఈ అవార్డుకు అతన్ని మించిన వ్యక్తి లేరు అని ఆ అధికారి చెప్పారు. ఈ ఏడాది మరే పద్మా అవార్డు కోసం ఎవరి పేరునూ నామినేట్ చేయలేదు. ధోనీ 302 వన్డేల్లో 9737 రన్స్, 90 టెస్టుల్లో 4876 రన్స్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో మొత్తం 16 సెంచరీలు, వంద హాఫ్ సెంచరీలు చేశాడు ధోనీ. అన్ని ఫార్మాట్లలో వికెట్ కీపర్గా 584 క్యాచ్లు అందుకోగా.. 163 స్టంపింగ్స్ కూడా అతని పేరిట ఉన్నాయి. ధోనీ ఇప్పటికే ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్త్న్ర, అర్జున, పద్మ శ్రీ అవార్డులు అందుకున్నాడు. ఒకవేళ ధోనీకి పద్మ భూషణ్ దక్కితే ఈ ఘనత సాధించిన 11వ క్రికెటర్గా అతను నిలుస్తాడు. గతంలో సచిన్, కపిల్దేవ్, సునీల్ గవాస్కర్, ద్రవిడ్, చందు బోర్డె, డీబీ దేవ్ధర్, సీకే నాయుడు, లాలా అమర్నాథ్ పద్మభూషణ్ అందుకున్న క్రికెటర్ల జాబితాలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 20,2017 02:32PM