న్యూఢిల్లీ: దసరా, నవరాత్రోత్సవాల వేళ పసిడికి డిమాండ్ పెరుగుతున్నది. వరుసగా నాలుగు రోజులపాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ పెరిగింది. నేడు బంగారం ధర రూ.150 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.30,750 కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరుగడంతో పసిడి ధరలు పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పసడితోపాటు వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి రూ.400 పెరగడంతో కిలో వెండి ధర రూ.40,900 కు చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగినట్లు బులియన్ మార్గాలు పేర్కొన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm