సిద్ధిపేట: కాంగ్రెస్ అవినీతి పాలనను టిఆర్ ఎస్ కొనసాగిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఆయన సిద్ధిపేటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో టీఆర్ ఎస్ దోపిడీ చేస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ లోపాలే ఉన్నాయి తెలిపారు. కేంద్ర పథకాల పేర్లను మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నారని లక్ష్మణ్ విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm