బెంగుళూర్: కేఫ్ కాఫీ డే కేంద్రాలపై ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 25 కాఫీ డే కేంద్రాలపై దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది. బెంగుళూర్లోని విట్టల్ మాల్యా రోడ్లో కాఫీడే ప్రదాన కార్యాలయం ఉంది. కర్నాటక మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఈ సంస్థను స్థాపించారు. కాఫీడే ఓనర్ సిద్ధార్థ ఇటీవల బీజేపీలో చేరారు. బెంగుళూరు, హసన్, చిక్కమాగలూరు, చెన్నై, ముంబైల్లోని కాఫీడే కేంద్రాలపై దాడులు జరిగాయి. కాఫీడేతో పాటు సిద్ధార్థకు సంబంధం ఉన్న ఇతర వ్యాపార క్షేత్రాలపైన కూడా ఐటీ దాడులు చేసింది. కాఫీ డే ఓనర్ వద్ద అప్రకటిత ఆదాయం ఉందా అన్న కోణంలో అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm