సంగారెడ్డి: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పాలాట శివారులోని ఆటవీ ప్రాంతంలో రైలు కింద పడి ఇద్దరు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. యువతి, యువకుడు రైలు పట్టాలపై పడుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులిద్దరూ సుమారు 27 ఏళ్ల లోపు వారై ఉంటారని అనుమానిస్తున్నారు. మృతిచెందిన ఇరువురూ ప్రేమికులు కావచ్చని, దంపతులైన కావచ్చని అనుమానిస్తున్నారు. మహిళ పెళ్లి జరిగినట్లుగా అధారాలు కనిపించకపోవడంతో, ప్రేమికులు కావచ్చని అనుమానిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm