కోల్కతా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తడబడింది. మిడిలార్డర్ ఫెయిలవడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో కెప్టెన్ విరాట్ కోహ్లి (92), ఓపెనర్ అజింక్య రహానే (55) రెండో వికెట్కు 102 పరుగులు జోడించడంతో భారీ స్కోరు చేసేలా కనిపించినా మిడిలార్డర్లో మనీష్ పాండే (3), కేదార్ జాదవ్ (25), ధోనీ (5), పాండ్యా (20) విఫలమయ్యారు. కీలకమైన సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడం టీమిండియా కొంప ముంచింది. 19 పరుగులకే రోహిత్ (7) ఔటైన దశలో విరాట్, రహానే రెండో వికెట్కు 102 పరుగులు జోడించి టీమ్ను మంచి స్థితిలో నిలిపారు. అయితే రహానే ఔటవగానే వికెట్ల పతనం మొదలైంది. క్రీజులో నిలదొక్కుకోవాల్సిన టైమ్లో అనవసరంగా వికెట్లు పారేసుకున్నారు. దీంతో 300 వరకు అవుతుందనుకున్న స్కోరు 252 పరుగులకే పరిమితమైంది. కూల్టర్ నైల్, రిచర్డ్సన్ చెరో 3 వికెట్లు తీశారు.
Mon Jan 19, 2015 06:51 pm