రాజన్నసిరిసిల్ల: ఇల్లంతకుంట సొరంగం వద్ద జరిగిన ప్రమాద సంఘటనపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇల్లంతకుంట సొరంగం వద్ద బండరాయి పడి నేడు ఓ కార్మికుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రమాదస్థలిని మంత్రి హరీశ్రావు పరిశీలించారు. మంత్రితో పాటు సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజిత్ ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి నీటిపారుదల అధికారులతో కలిసి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. ప్రమాద ఘటనపై నిపుణుల కమిటీని వేశామని, 15 రోజుల్లో కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm