అమరావతి: రాష్ట్రంలో విద్య, వైద్య ఆరోగ్య రంగాలకు నిధులు కేటాయిస్తున్నా ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అహాలు వీడి సమన్వయంతో పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకత్వం సరిగ్గా ఉంటే ఈ తరహా ఇబ్బందులు ఉండవంటూ ఆయా శాఖల మంత్రులను పరోక్షంగా మందలించారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో కలెక్టర్ల సదస్సు రెండోరోజు కొనసాగింది. వైద్య, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, పట్టణాభివృద్ధి, పురపాలక, వృత్తి నైపుణ్యం తదితర శాఖలపై సీఎం అధ్యక్షతన కీలక చర్చ జరిగింది. విద్యాశాఖ అధికారుల పనితీరుపైనా ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సు లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బయో మెట్రిక్ విధానం అమలులో తాత్సారంపై ఆయన మండిపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm