ఢిల్లీ: వైకాపా ఎమ్మెల్యే ఆదిమూలం సురేశ్కు, ఆయన సతీమణి విజయలక్ష్మికి సీబీఐ షాకిచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నారంటూ వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి రూ.కోటికి పైగా ఆస్తులు కల్గి ఉన్నారని పేర్కొంటూ వారిద్దరిపైనా అధికారులు కేసు నమోదు చేశారు. విజయలక్ష్మీ ఐఆర్ఎస్ అధికారిణిగా పనిచేస్తున్నారు. సురేశ్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm