హైదరాబాద్: పండుగల సెలవులను దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఈనెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచిన విషయం తెలిసిందే. విజయవాడ రైల్వే స్టేషన్లోనూ ప్లాట్ఫాం టికెట్ ధర పెరిగింది. ప్రస్తుతం రూ.10 గా ఉన్న ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.20 పెంచారు. పెంచిన ధరలు ఈ నెల 23 నుంచి అక్టోబరు 4 వరకు అమలులో ఉంటాయి. అనవసర రద్దీని నివారించడానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, పండుగ సెలవుల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువగా కనిపించనుంది.
Mon Jan 19, 2015 06:51 pm