కోల్కతా: మమతా బెనర్జీ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు గట్టి షాకిచ్చింది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన నిబంధనల ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టేసింది. అక్టోబర్ 1 మొహర్రం సందర్భంగా దుర్గామాత విగ్రహాలను సెప్టెంబర్ 30 రాత్రి 10 గంటల వరకే నిమజ్జనం చేయాలని.. మిగిలినవి అక్టోబర్ 2న నిమజ్జనం చేయాలని మమతా సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన మూడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ... అన్ని రోజుల్లోనూ దుర్గామాత విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ తివారీ, న్యాయమూర్తి హరీశ్ టాండన్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. దుర్గామాత, మొహర్రం వూరేగింపులకు వేర్వేరు మార్గాలను కేటాయించాలని పోలీసులకు సూచించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm