శంషాబాద్: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ గురువారం కలకలం సృష్టించింది. ఓ ప్రయాణికుడి లగేజీలో లభించగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి లక్నో వెళ్తున్న ప్రయాణికుల లగేజీని ఇమ్మిగ్రేషన్ అధికారులు స్కానింగ్ చేస్తుండగా ఓ ప్రయాణికుడి బ్యాగులో బుల్లెట్ ఉన్నట్టు తేలింది. ఆ బ్యాగు ఎవరిదని ఆరా తీయగా... హైదరాబాద్కు చెందిన సతీ్షకుమార్ అనే ప్రయాణికుడిదిగా గుర్తించారు. బుల్లెట్ను స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm