అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కత్తేకొట్టాల గ్రామానికి చెందిన కత్తే శ్రీనివాసులు, మల్లక్క దంపతుల కుమారుడు ప్రభాస్(10).. గవ్వల ముత్యాలప్ప, సావిత్రమ్మ దంపతుల కుమారుడు మనోహర్(9) నీటికుంటలో పడి మృతి చెందారు. ధర్మవరంలోని ప్రైవేటు పాఠశాలలో మనోహర్ 3వ తరగతి, ప్రభాస్ 4వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరు గురువారం ఉదయం బయటకు వెళ్లి ఎంతటికీ రాకపోవడంతో ఆ రెండు కుటుంబాలు గాలించాయి. గ్రామం పక్కనే ఉన్న నీటికుంట వద్ద పిల్లల దుస్తులను గమనించి అందులోకి దిగి గాలించగా ఇద్దరి శవాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm