జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని మహాముత్తారం మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన రైతు జాడి రాజయ్య(45) పత్తి చేనులో పనులు చేస్తుండగా ఒక్కసారిగా అతడిపై అడవి పంది దాడి చేసింది. రాజయ్యను అడవి పంది తీవ్రంగా గాయపరించింది. గమనించిన స్థానికులు వెంటనే అడవి పందిని తరిమికొట్టి.. రాజయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm