సిద్దిపేట: రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో రూ. 2.4కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన రైతు సమన్వయ కమిటీలు జనం మెచ్చిన కమిటీలుగా మారాయన్నారు. ఈ కమిటీలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ చేసిన దుష్ట ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.16లక్షలతో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని గ్రామ వితంతువుతో మంత్రి హరీశ్రావు ప్రారంభింపజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm