బెంగళూరు : కుల, మతాల పట్టింపులు, పరువు కోసం ఓ కుటుంబం పాకులాడిందంటే అర్థముందని అనుకోవచ్చు. ఓ గ్రామం గ్రామం మొత్తం పరువు కోసం అనాగరికంగా, అమానవీయంగా ప్రవర్తిస్తే ఏమనుకోవాలి? నాగరిక సమాజంలో ఉన్నామా? అనే సందేహాన్ని రేకెత్తించే ఘటన ఇది. కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లాడిన ఓ జంటను గ్రామ బహిష్కరణ చేసిందా గ్రామం.
ఆశ్చర్యమేమిటంటే- ఆ ఊళ్లో ఒక్కరు కూడా ఆ దంపతులకు అండగా నిలవలేదు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హోసపెటె తాలూకాలోని కడ్డిరాంపురకు చెందిన పరశురామ్, స్వరూపారాణి ప్రేమించుకున్నారు. వేర్వేరు కులానికి చెందిన వారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. రోజులు గడిచిన కొద్దీ పెద్దలు తమ ప్రేమను అర్థం చేసుకుంటారని, ఆశీర్వదిస్తారని ఆశించారు. వారిని ఎదిరించి రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తరువాత వారిద్దరూ గంగావతి పట్టణంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రెండు నెలల కిందట తొలిసారిగా పరశురామ్, స్వరూపారాణి తమ స్వగ్రామం కడ్డిరాంపురకు వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని ఊరిబయటే ఆపేశారు. గ్రామంలో అడుగు పెట్టనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. వారిని చూసి, గ్రామంలో ఉండే పిల్లలు కూడా చెడిపోతారనేది గ్రామస్తుల వాదన. ఈ రెండునెలల కాలంలో చాలాసార్లు వాళ్లు కడ్డిరాంపురకు వెళ్లారు. వెళ్లిన ప్రతీసారీ అవమానాలే ఎదురయ్యాయి. పైగా ఇంకోసారి అడుగు పెట్టే ప్రయత్నం చేస్తే చంపేస్తామనీ బెదిరించారు. ఒకట్రెండు సార్లు దాడులు కూడా జరిగాయట. తాము ఎదుర్కొంటున్న పరిస్థితిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఫలితం లేదు. దీనితో బళ్లారి జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 24,2017 05:54PM