ఢాకా: మయన్మార్ నుంచి వలసలుగా వచ్చిన రోహింగ్యా ముస్లిం శరణార్థులు మొబైల్ ఫోన్స్ వినియోగంపై బంగ్లాదేశ్ నిషేధం విధించింది. బంగ్లా దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి టెలికం మంత్రి హలీమ్ వెల్లడించారు. బంగ్లాదేశ్లో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు నాలుగు ఉన్నాయి. ఆ దేశంలోకి వచ్చిన 4.3లక్షల మంది రోహింగ్యా శరణార్థులకు మొబైల్ ఫోన్స్, సిమ్కార్డులు విక్రయంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు టెలికం మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. ఎవరైనా ఆదేశాలను లెక్కచేయకుండా ప్రవర్తిస్తే.. వాళ్లు భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మానవీయకోణంలో రోహింగ్యాలను మా దేశంలోకి రానిచ్చాం. అలాగే మా దేశ భద్రతను పరిరక్షించుకోవాల్సిన విషయంలో ఎటువంటి రాజీ లేదు. అందుకే ఈ నిషేధం విధించాం. అని మంత్రి హలీమ్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm