రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్లోని మైలార్దేవ్పల్లి స్టేషన్ పరిధిలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులో ఇద్దరు మరణించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm