విజయవాడ: విజయవాడ గాయత్రీనగర్ ఎస్బీఐ శాఖలో నగల దుర్వినియోగం కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టయిన మణప్పురం ఉద్యోగి దిలీప్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన సూత్రధారి ఎస్బీఐ ఉద్యోగి కృష్ణచైతన్య, మణప్పురం ఉద్యోగి ఫణికుమార్ ఇప్పటికే అరెస్టు అయ్యారు. సీఐడీ అధికారులు మణప్పురం మాచవరం మాజీ మేనేజర్, డిప్యూటీ మేనేజర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎస్బీఐలో ఖాతాదారులు తాకట్టుపెట్టిన పదిన్నర కేజీల బంగారాన్ని.. మణప్పురంలో తిరిగి తాకట్టుపెట్టుకుని రూ.1,89,00,000 రుణాన్ని కృష్ణచైతన్య పేరుపై మంజూరు చేయడంలో వీరిద్దరు కీలకంగా వ్యవహరించారని సీఐడీ భావిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm