హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ పరిశీలించనున్నారు. గవర్నర్ రేపు మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన అధికారులు రాజ్భవన్లో ఆదివారం సాయంత్రం గవర్నర్ను కలిశారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా, భూ రికార్డుల ప్రక్షాళన మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా భూ రికార్డుల ప్రక్షాళన పురోగతిని అధికారులు గవర్నర్కు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm