ఇండోర్: మూడో వన్డేలో హార్ధిక్ పాండ్యా కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 45 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ చేశాడు. మరో ఎండ్లో ఉన్న మనీష్ పాండే అతడికి పూర్తి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం 44 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. విజయానికి 36 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm