న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, బిఎస్ఎన్ఎల్ పోటీని ఎదుర్కొనేందుకు పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ఎయిర్టెల్ మరో కొత్త పథకం తీసుకొచ్చింది. 'బోనస్ 30 జిబి' పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం కింద నెలకు పది జిబి చొప్పున మూడు నెలల కాలంలో 30 జిబి డేటా ఉచితంగా వాడుకోవచ్చు. ఈ పథకం కోసం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సిమ్ కార్డును కూడా ఎయిర్టెల్ డోర్ డెలివరీ చేయనున్నట్టు ఎయిర్టెల్.ఇన్ వెబ్సైట్లో తెలిపింది. రూ.299 తప్పించి రూ.1,000లోపు ఉండే మిగతా అన్ని ప్లాన్స్లో ఈ ఆఫర్ లభిస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm