ప్రకాశం: చీరాల కొత్తపేటలో చిట్టీల వ్యాపారుల కుచ్చుటోపి బహిర్గతమైంది. రూ. 70 లక్షల మేర మోసం చేసినట్లు తెలిసింది. పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు చిట్టీల వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించగా పది సవర్ల బంగారం, రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm