తిరుమల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారి సర్వ దర్శనానికి 8గంటల సమయం పడుతుండగా నడకదారి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాగా... తిరుమల శ్రీవారిని ఆదివారం 84,151మంది భక్తులు దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm