న్యూస్టుడే: ఆడుకుంటూ చింతగింజ మింగిన ఓ ఐదేళ్ల చిన్నారి ఆడక మృతి చెందిన విషాద ఘటనిది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్కు చెందిన రాసూరి లక్ష్మి, లింగం దంపతుల కుమార్తె పవిత్ర(5) ఆదివారం సాయంత్రం వారి ఇంటి ఎదుట ఆడుకుంటూ చింతగింజ మింగింది. అది గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక అవస్థలు పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చికిత్స నిమిత్తం చిన్నారిని జనగామ ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అప్పటివరకు సంతోషంగా ఆడుకుంటూ కనిపించిన ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.
Mon Jan 19, 2015 06:51 pm