భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఇల్లెందు మునిసిపల్ కమిషనర్ పై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డ సంఘటన వెలుగుచూసింది. నగరంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అయితే... వీటిని మునిసిపల్ సిబ్బంది తొలగించారు. కమిషనర్ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలను తొలగించారని ఆరోపిస్తూ పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కమిషనర్తో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు. కాగా... తనపై దాడి జరిగిందని, టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని మునిసిపల్ కమిషనర్ ఇల్లెందు సబ్ డివిజనల్ పోలీస్ అధికారికి ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm