రంగారెడ్డి: కాటేదాన్ పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. చాక్లెట్స్ తయారు చేసే ఎస్ఏ ఫుడ్ కంపెనీలో బాయిలర్ పేలిన సంఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కారన్ అనే కార్మికుడు మృతిచెందాడు. కాగా... ప్రమాదం జరిగి రెండు గంటలు కావస్తున్నా కంపెనీ యజమాని అక్కడకు రాకపోవడంతో కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అపరిశుభ్ర పరిసరాలలో చాక్లెట్స్ తయారు చేస్తున్నట్లు ప్రమాదం ప్రదేశాన్ని బట్టి తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm