ముంబయి: ఈ నెల చివరి వారం స్టాక్మార్కెట్లలో ట్రేడింగ్ నష్టాలతో ప్రారంభమైంది. సోమవారం ఉదయం గత ముగింపు కంటే 27పాయింట్లు తక్కువగా 9937 వద్ద నిఫ్టీ ప్రారంభమైంది. ఈ ట్రెండ్ కొనసాగి ప్రస్తుతం 97 పాయింట్ల నష్టంతో 9868 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 243 పాయింట్లు కుంగి 31,678 వద్ద ట్రేడవుతోంది. ఈ వారాంతంలో ఎఫ్అండ్వో సెటిల్మెంట్లు ఉండటంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడు అమెరికా-ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు మార్కెట్లో యుద్ధ భయాన్ని విపరీతంగా పెంచాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm