తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో ఇవాళ ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తున్నది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. అయితే.. ఇవాళ తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలై పది గంటలకల్లా భారీగా వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహ వాహనం సేవ జరుగుతుండగా వర్షం కురుస్తున్నా.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm