హైదరాబాద్: 'మహాభారతం' సినిమాను తాను తీయడం లేదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపాడు. 'మహాభారతం' సినిమాను రాజమౌళి తీస్తాడని గతంలో ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తాను 'బాహుబలి-2' విజయాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. 'మహాభారతం' సినిమా తన కల అని చెప్పానే కానీ, తాను తీస్తున్నానని చెప్పలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే తాను ఏ సినిమా మొదలు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. కొంత కాలం తరువాత తన తరువాత ప్రాజెక్టు ప్రారంభిస్తానని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm