హైదరాబాద్: రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా డాక్టర్ ఎస్. రాజా సదారాం, కమిషనర్గా బుద్ధా మురళీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ వీరిద్దరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్భవన్లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరయ్యారు. అనంతరం రాజ్భవన్ నుంచి నేరుగా నాంపల్లిలోని ఆర్టీఐ కార్యాలయానికి సదారాం, మురళీ బయల్దేరారు. ఆర్టీఐ కార్యాలయంలో సమాచార ప్రధాన కమిషనర్గా సదారాం, కమిషనర్గా మురళీ బాధ్యతలు స్వీకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm