వరంగల్ రూరల్ : సంగెం మండలం చింతలపల్లి, గీసుకొండ మండలం శాయంపేట గ్రామాల మధ్య ఈ నెల 22న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న టెక్స్ టైల్ పార్కు స్థలాన్ని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సందర్శించారు. ఈ సందర్భంగా సభావేదిక, పార్కింగ్, పైలాన్ నిర్మాణం తదితర ఏర్పాట్లపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ సుధీర్ బాబు, వివిధ శాఖల అధికారులతో మంత్రి కడియం సమీక్షించారు.
Mon Jan 19, 2015 06:51 pm