శివ్పురి: మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లా కొలారస్ విధాన్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ సింగ్ యాదవ్ బుధవారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామ్ సింగ్ యాదవ్కు గుండెపోటు రాడంతో ఆయనను గ్వాలియర్ ఆసుపత్రికి తరలించారని, అక్కడే ఆయన కన్నుమూశారని జిల్లా కాంగ్రెస్ ప్రతినిధి హర్వీర్ సింగ్ రఘువంశీ తెలిపారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కొలారస్ నుంచి రామ్ సింగ్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనను అభిమానులంతా ఃదాదాజీః అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు. శివ్పురి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా కూడా ఆయన పనిచేశారు. రామ్ సింగ్ యాదవ్ మృతికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, విపక్ష నేత అజయ్ సింగ్, పిసీసీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్, తదితరులు సంతాపం ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm