భద్రాద్రి: జనావాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ భద్రాద్రిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇళ్ల మధ్య మందు షాపులు ఏర్పాటు చేయడంపై కాలనీవాసులు మండిపడుతున్నారు. బినామీ మద్యం కాంట్రాక్టర్లపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల భద్రాద్రి కరకట్ట ప్రాంతంలో మద్యం షాపుల ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. మందు షాపుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ 10 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మద్యం దుకాణాలు వద్దని తాము ఎంతగా మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm