భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రాకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన భోపాల్ జిల్లా కోర్టు కేకే మిశ్రాకు జైలుశిక్షతోపాటు రూ.25వేల జరిమానా విధించింది. రవాణాశాఖలో నియామకాల కుంభకోణంపై కాంగ్రెస్ నేత కేకే మిశ్రా అభియోగాలు చేయడంతో..అతనిపై సీఎం శివరాజ్సింగ్ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm