ఫుజౌ: చైనా ఓపెన్ సూపర్ సిరీస్లో భారత పోరు ముగిసింది. భారత్ తరఫున పోరులో ఉన్న పీవీ సింధు కూడా క్వార్టర్స్ నుంచే వెనుదిరిగింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్లో రెండో సీడ్ సింధు 11-21, 10-21తో గావొ ఫాంగ్జీ(చైనా) చేతిలో ఓడిపోయింది. 38నిమిషాల పాటు మ్యాచ్లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. క్వార్టర్స్ నుంచే సింధు కూడా నిష్క్రమించడంతో చైనా ఓపెన్ సూపర్ సిరీస్లో భారత పోరుకు తెరపడినట్లయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్లో సింధు 2వ స్థానంలో కొనసాగుతుండగా.. ఫాంగ్జీ ర్యాంకు 89. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో సైనా, ప్రణయ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నీలో పాల్గొనలేదు.
Mon Jan 19, 2015 06:51 pm