హైదరాబాద్: కామాంధుడి నుంచి తనను తాను రక్షించుకునే క్రమంలో శరీరానికి మంటలు అంటుకొని మహిళకు తీవ్రగాయాలైన ఘటన గురువారం బాగల్కోటె జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బాదామి తాలూకా కరూరు పట్టణానికి చెందిన మహిళ (33) మూడేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో ముగ్గురు పిల్లలతో కలసి ఒంటరిగా జీవిస్తున్నారు. మహిళ పరిస్థితిని గమనించిన సురేశ్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా మహిళను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం నిందితుడు సురేశ్ మహిళపై అత్యాచారానికి యత్నించగా తనను తాను రక్షించుకోవడానికి మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని దగ్గరకు వస్తే నిప్పటించుకుంటానని బెదిరించసాగింది. దీంతో నిందితుడు సురేశ్ మహిళకు నిప్పటించడంతో మంటలకు తాళలేక మహిళ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉందని, నిందితుడి కోసం గాలిస్తున్నామంటూ కేసు నమోదు చేసుకున్న కరూరు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm