చెన్నై: సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి. ఈ దాడుల నుండి వారిని రక్షించేందుకు ఎన్ని చట్టాలు తెచ్చిన దాడులు మాత్రం జరుగుతునే వున్నాయి. తాజాగా తుపాకితో బెదిరించి 50 మంది మహిళలపై అత్యాచారం చేసిన 28 ఏళ్ల మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మదన్ అరివలగన్ (28)గా గుర్తించారు. తుపాకితో మహిళలను బెదిరించి దోచుకుని ఆపై వారిపై అత్యాచారానికి పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. అంతేకాక ఆ ఘటనను వీడియో కూడా తీసేవాడని పేర్కొన్నారు. మధుర్లోని కృష్ణగిరికి చెందిన మదన్ మొబైల్ను చెక్ చేసిన పోలీసులకు మతిపోయినంత పనైంది. దాని నిండా అతడు అత్యాచారానికి పాల్పడిన వీడియోలే ఉన్నాయి. వాటిని చూపించి బాధిత మహిళలను బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు మదన్ కృష్ణగిరి కాలేజీలో బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తిచేశాడు. బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో రెండేళ్లపాటు పనిచేశాడు. 2015లో చెన్నైకి చేరుకున్న మదన్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో చోరీల బాట పట్టాడు. తానోసారి ఓ యువతిని దోచుకుని అనంతరం ఆమెపై అత్యాచారం చేసినట్టు దర్యాప్తులో వెల్లడించాడు. ఆ తర్వాతి నుంచి ఇదే పనిగా పెట్టుకున్నట్టు అంగీకరించాడు. తానెంతో మంది మహిళను తుపాకితో బెదిరించి వారి ఇళ్లలోనే అత్యాచారానికి పాల్పడినట్టు మదన్ అంగీకరించాడు.
Mon Jan 19, 2015 06:51 pm