హైదరాబాద్: ఫ్రీడమ్ హైదరాబాద్ 10కే రన్ టీ-షర్ట్స్, మెడల్స్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. 10కే రన్ 15 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వాహాకులకు మంత్రి అభినందనలు తెలిపారు. నగరంలోని సోమాజిగూడ హోటల్ పార్క్లో జరిగిన 10కే రన్ టీ-షర్ట్స్, మెడల్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఎన్నో గొప్ప ఈవెంట్స్ జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. క్రికెట్ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నా రన్నింగ్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నరని తెలిపారు. 10కే రన్ నిర్వహించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఇందుకు సహరిస్తున్న స్పాన్సర్స్ అందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రన్కు ఇప్పటి వరకు 9 వేల రిజిస్ట్రేన్లు వచ్చినట్లు ఇవి ఇంకా పెరుగుతాయని మంత్రి వెల్లడించారు. ఈ నెల 26వ తేదీన 10కే రన్ నిర్వహణ. 22వ తేదీ వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం.
Mon Jan 19, 2015 06:51 pm