చెన్నై: ఏఐఏడీఎంకే నాయకురాలు శశికళకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విదేశాల నుంచి లగ్జరీ కారు దిగుమతి చేసుకుని పన్ను ఎగవేసిన కేసులో ఆమె భర్త నటరాజన్కు దిగువకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను మద్రాస్ హైకోర్టు సమర్ధించింది. నటరాజన్ సహా మరో ముగ్గురు 1994లో టొయోటా లెక్సస్ కారును విదేశాల దిగుమతి చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.1.06 కోట్ల పన్ను చెల్లించలేదు. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడంతో సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నటరాజన్తో పాటు, అతని బంధువు భాస్కరన్, యోగేష్ బాలకృష్ణన్, సుందరరాజన్పై అప్పట్లో కేసు నమోదు చేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం 2010లో వీరికి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దిగువకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నటరాజన్, మరో ముగ్గురు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఏడేళ్లపాటు హైకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. ఇరు వర్గాల వాదనల అనంతరం దిగువకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ ఇవాళ తీర్పు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm