హైదరాబాద్: కరీంనగర్ జైలులో ఉన్న ఏఎస్ఐ మోహన్రెడ్డి ములాఖత్లు నిబంధనల ప్రకారమే జరిగినట్లు జైళ్లశాఖ ఐజీ నరసింహం తెలిపారు. ఏఎస్ఐ మోహన్రెడ్డి ములాఖత్పై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కరీంనగర్ జైలులో మోహన్రెడ్డికి ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించటం లేదన్నారు. ఏడు నెలలుగా జైలులో ఉన్న మోహన్రెడ్డికి జైళ్ల మాన్యువల్ ప్రకారమే ములాఖత్కు అనుమతిస్తున్నామన్నారు. అయినప్పటికీ ఆరోపణల నేపథ్యంలో మోహన్రెడ్డి ములాఖత్లు జరిగినప్పటి సీసీటీవీ దృశ్యాలు పరిశీలించినట్లు చెప్పారు. జైలు సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోపణలపై విచారణకు డీఐజీ సైదయ్య నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm