హైదరాబాద్: ప్రగతిభవన్లో ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమైయారు. ఎస్టీల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు ప్రణాళికలు సూచించాలని సీఎం ఆదేశించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలన్న కలను నెరవేర్చబోతున్నామన్నారు. ఎస్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు నెలకొల్పామని, చిన్న జిల్లాలు కావడంతో ఎస్టీ ప్రాంతాలపై దృష్టిసారించే అవకాశముందన్నారు. ఎస్టీల అభివృద్ధికి రేపు ప్రజాప్రతినిధులు సమావేశం కావాలని కేసీఆర్ తెలిపారు. తగు ప్రతిపాదనలతో ప్రగతిభవన్కు రావాలని సీఎం కేసీఆర్ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm