మేడ్చల్: జిల్లా కీసరలో స్కూటర్ పై వెళ్తున్న దంపతులపై బంగారం కోసం గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇతర వ్యక్తులు రావడంతో దుండగుడు తప్పించుకుని పారిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితున్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. బాధితులు కొండాపూర్ వెళ్తుండగా ఘటన జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm