వికారాబాద్: జిల్లా కేంద్రమైన వికారాబాద్లోని ఆర్టీవో కార్యాలయం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఆగిఉన్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ఉన్న విష్ణువర్ధన్రెడ్డి(20) అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా ఆయనది పూడూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm